వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై కేంద్రం రేపు మరో ప్రకటన?

By Pratap
|
Google Oneindia TeluguNews

R Venkat Reddy
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం రేపు మరో ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణులు కమిటీ వేస్తూ ఆ ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. తెలంగాణపై శుభవార్త అందుతుందని, అందుకే తమ ఢిల్లీ పర్యటన రద్దయిందని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి ఆర్. వెంకటరెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. దీన్ని బట్టి రేపు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాబట్టడానికి అవసరమైతే ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు. సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా సోమవారం రాత్రి కాంగ్రెసు శాసనసభ్యులు జానారెడ్డి, దామోదర్ రెడ్డిలకు కూడా ఇదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే డెడ్ లైన్లకు లొంగినట్లుగా కనిపించకూడదనేది కాంగ్రెసు అధిష్టానం యోచనగా కనిపిస్తోంది. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటనకు తెలంగాణ రాజకీయ జెఎసి ఈ నెల 28వ తేదీని గడువుగా పెట్టింది. ఈలోగా కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేయాలని కాంగ్రెసు కూడా భాగస్వామి అయిన జెఎసి నిర్ణయం తీసుకుంది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన కాంగ్రెసు ప్రజాప్రతినిధులు మంగళవారం ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని భావించారు. అయితే అధిష్టానం సూచన మేరకు వారు ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X