ఎపి దేశానికే ఆదర్శం కావాలి: గవర్నర్

Narasimhan
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆశించారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆయన మంగళవారం సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షాలు తెలిపారు. రాష్టం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తుందని ఆయన చెప్పారు. ఎందరో మహానుభావుల త్యాగాలతో సిద్ధించిన స్వేచ్ఛా స్వాతంత్ర్య ఫలలాను, చారిత్రక సౌరభాలను పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు. హింసకు తావు లేకుండా ప్రజలు సోదరభావంతో మెలగాలని ఆయన కోరారు.

శాంతిసామరస్యాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. శాంతిప్రక్రియ కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆయన అన్నారు. మావోయిస్టులను అరికట్టడంలో ప్రభుత్వం సఫలమైందని ఆయన చెప్పారు. మావోయిస్టులను అరికట్టడంలో రాష్ట్రం ట్రెండ్ సెటర్ గా నిలిచిందని ఆయన కొనియాడారు. ఈ విషయంలో గ్రేహౌండ్స్ పాత్ర ప్రశంసనీయమని ఆయన అన్నారు. బహుముఖ పద్ధతుల ద్వారా మావోయిస్టు సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తోందని ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాస పథకం వంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+