వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రేపటి నుంచి మేడారంలో రోజుకు 20 లక్షల మంది
జాతరలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వీటిని పర్యవేక్షించేందుకు 500 మంది జిల్లా స్థాయి అధికారులను నియమించారు. మూడు వేల మంది సిబ్బంది భక్తుల సేవల్లో నిమగ్నమయ్యారు. భక్తుల బ్యారక్, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ఆర్టీసీ పాయింట్లు తదితర బాధ్యతల పర్యవేక్షణ కోసం 6500 మంది పోలీసు సిబ్బంది పని చేస్తున్నారు. ఆర్టీసీ 2700 బస్సు సర్వీసులు నడుపుతోంది.
గత బుధవారం నుంచి ఇప్పటి వరకు 1200 బస్సు ట్రిప్పుల ద్వారా భక్తులను ఆర్టీసీ మేడారానికి చేరవేసింది. అలాగే వేలాది ప్రైవేటు వాహనాల్లో భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. 27న సారలమ్మ, 28న సమ్మక్క గద్దెలకు చేరనున్నారు. దీంతో భక్తుల తాకిడి బాగా పెరుతుంది. 29న మొక్కల సమర్పణ మొదలుకుని 30న సాయంత్రం దేవతలు వన ప్రవేశం చేసే వరకూ భక్తజనంతో మేడారం పోటెత్తనుంది.
Comments
Story first published: Tuesday, January 26, 2010, 11:56 [IST]