వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ నుంచి వెళ్లగొడుతారు: జయశంకర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayashankar
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే హైదరాబాద్ నుంచి సీమాంధ్ర పెత్తందార్లు తెలంగాణవారిని హైదరాబాదు నుంచి వెళ్లగొడుతారని కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జయశంకర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సీమాంధ్ర నేతలది పైచేయి అయితే తెలంగాణ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి నేతల రిలే నిరాహార దీక్షలను ఆయన మంగళవారం ప్రారంభించారు. దీక్షా శిబిరం వద్ద జాతీయ పతాకతో పాటు తెలంగాణ జెండాను కూడా ఆవిష్కరించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాజకీయ నాయకులు విఫలమైనా ప్రజలు విఫలం కాబోరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే దొరల రాజ్యం వస్తుందని అంటున్నారని, ఏ రాజ్యం వచ్చినా దొంగల రాజ్యం మాత్రం రాదని ఆయన అన్నారు. తెలంగాణపై తాము వివరణ పత్రం విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని ఆయన చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల మనసులు విరిగిపోయాయని, ఆత్మగౌరవంతో బతకాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X