తెలంగాణపై త్వరలో మొయిలీ ప్రకటన: కెకె

K Kesava Rao
న్యూఢిల్లీ: తెలంగాణపై త్వరలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటన చేస్తారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావు చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. గత రాత్రి అధిష్టానానికి కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యులు ఆర్ దామోదర్ రెడ్డి, కె జానారెడ్డిలతో పాటు తాను పరిస్థితిని వివరించామని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో ఆర్ దామోదర్ రెడ్డి, జానారెడ్డి రాజీపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.

తెలంగాణకు అనుకూలంగా ఢిల్లీలో పరిస్థితులు మారాయని పసిగట్టిన సీమాంధ్ర కాంగ్రెసు నేతలు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్ మెంటు కోరారు. అయితే ఆమె అందుకు నిరాకరించారు. కాగా, వీరప్ప మొయిలీ మంగళవారమే ప్రకటన చేసే ఆవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన పార్టీ పరంగా ప్రకటన చేస్తారా, ప్రభుత్వం తరఫున ప్రకటన చేస్తారా అనేది తెలియడం లేదు. తెలంగాణపై న్యాయనిపుణుల కమిటీ వేస్తారని భావిస్తున్న తరుణంలో ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ప్రకటన చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఇదిలా వుంటే, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం సాయంత్రం రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలతో సమావేశమవుతున్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెసు నాయకులకు ఆమె స్పష్టమైన సందేశం ఇచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+