వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐపియల్ మ్యాచులను అడ్డుకోం: కోదండరామ్
తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఐపియల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముంబైకి మార్చినట్లు లలిత్ మోడీ ఇది వరకే ప్రకటించారు. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ ఆందోళనకారులు ఈ నెల 12వ తేదీన క్రికెట్ మ్యాచును అడ్డుకున్న నేపథ్యంలో ఐపియల్ ఆ నిర్ణయం తీసుకుంది. ఈ స్థితిలో దక్కన్ చార్జర్స్ తో జరిగే మ్యాచులు హైదరాబాదులో జరిగే పరిస్థితిపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. హైదరాబాదులో జరగాల్సిన మ్యాచులను ఇతర ప్రాంతాలకు తరలిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితిలో కోదండరామ్ ఆ ప్రకటన చేశారు.
Story first published: Tuesday, January 26, 2010, 14:39 [IST]