వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలిస్తాం: కెసిఆర్

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: తెలంగాణ కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాడతామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చెప్పారు. తెలంగాణపై కేంద్రం వేసిన కమిటీ విధివిధానాలు తెలిసిన తరువాత స్పందిస్తామన్నారు. తెలంగాణ కోసం ఇప్పటికే 200 మంది ఆత్మహత్య చేసుక్నురని, ఇకనైనా ఆత్మహత్యలు ఆపండని ఆయన కోరారు.

ఇలా ఉండగా కేంద్రప్రభుత్వం వేయబోయే కమిటీని వ్యతిరేకిస్తున్నామని, దీన్ని అడ్డుకుంటామని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. కేంద్రం కమిటీ వేయడం సరికాదని తెలిపారు. విభజన అంటూ జరిగితే ముందు తమిళనాడును విభజించాలని డిమాండ్‌చేశారు. చిదంబరం చర్యలను అనుమానిస్తున్నామని తెలిపారు. సీమాంధ్ర ఎంపీలను సంప్రదించకుండా చిదంబరం ప్రకటించడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్‌ తెలంగాణ నేతలు జేఏసీలో చేరడమంటే పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడమేనని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X