వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొయిలీ ప్రకటనపై తెలంగాణ నేతల భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: తెలంగాణ జెఎసి నుంచి తప్పుకోవాలని తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ చేసిన ఆదేశాలపై చర్చించడానికి కాంగ్రెసు తెలంగాణ నేతలు సోమవారం సమావేశమవుతున్నారు. మాజీ మంత్రి కె. జానా రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరుగుతుందని కాంగ్రెసు తెలంగాణ కార్యాచరణ కమిటీ కన్వీనర్ బస్వరాజు సారయ్య చెప్పారు. జెఎసి జానా రెడ్డి నివాసంలో ఏర్పాటైందని, ఇది పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదని ఆయన ఆదివారం రాత్రి మీడియా ప్రతినిధులతో అన్నారు.

మొయిలీ ప్రకటనపై తెలంగాణ కాంగ్రెసు నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. సీమాంధ్ర నాయకులు సమైక్య జెఎసి ఏర్పాటు చేసి తెలంగాణకు వ్యతిరేకంగా, పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, వారికి కూడా తమకు వర్తించిన ఆదేశాలే ఆదేశించాలని వారంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X