ఢిల్లీలో ఇరు ప్రాంతాల పోటాపోటీ భేటీలు

Kavuri Sambhasiva Rao-Kesava Rao
న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితులపై కమిటీ వేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ప్రకటన వచ్చిన వెంటనే రాష్ట్ర రాజకీయ నాయకుల్లో తీవ్ర కదలిక వచ్చింది. ఎవరికి వారు తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నప్పటికీ కమిటీ ఎందుకు వేస్తున్నారనే విషయం తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఏకాభిప్రాయ సాధనకు, రాష్ట్ర పరిస్థితులపై కమిటీ వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో దాని అసలు సంగతి తెలియక తికమక పడుతున్నారు. దీంతో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకులు విడివిడిగా ఢిల్లీలో సమావేశమయ్యారు.

సీనియర్ కాంగ్రెసు నేత కె. కేశవరావు నివాసంలో తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. తమలో తాము చర్చించుకున్న తర్వాతనే కమిటీపై మాట్లాడుతామని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆ వెంటనే తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కేశవరావు నివాసంలో సమావేశమై ఏ విధంగా ప్రతిస్పందించాలనే విషయంపై చర్చిస్తున్నారు. అలాగే సీమాంధ్ర నాయకులు కోస్తాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశమయ్యారు. కమిటీ తెలంగాణ ఏర్పాటుకైతే వ్యతిరేకించాలనేది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది.

రాయలసీమకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బుధవారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. కమిటీ తెలంగాణ ఇవ్వడానికి కాదని, రాష్ట్ర పరిస్థితిపై మాత్రమేనని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. కమిటీ ఏర్పాటుతో రెండు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+