8న శ్రీకృష్ణ కమిటీ తొలి సమావేశం

తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసినందున రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కోరారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విద్యార్థులు ఆందోళనలు విరమించాలని, కళాశాలలకు వెళ్తూ పరీక్షలపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. పరిపాలన సజావుగా సాగకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై కమిటీని ప్రకటించిన తర్వాత ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications