వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమిటీపై టిడిపి సీమాంద్ర నేతల వ్యతిరేకత

By Pratap
|
Google Oneindia TeluguNews

Yerram Naidu
న్యూఢిల్లీ/ హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితులపై విస్తృతాభిప్రాయ సేకరణకు కేంద్రం వేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ను తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాన్ని చీల్చే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసిందని వారు విమర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కమిటీ వేయడం వెనక కుట్ర ఉందని కె. ఎర్రంనాయుడు విమర్శించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు ఉండగా ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కమిటీ వేయడం వెనక కుట్ర దాగి ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో కమిటీ వేస్తారా అని ఆయన అడిగారు.

తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు ఎంవి మైసురా రెడ్డి కేంద్ర హోం మంత్రి మైసురా రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. హైదరాబాదు పెద్ద నగరంగా ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ పలుకుబడిని దెబ్బ తీయడానికి చిదంబరం కుట్ర చేశారని ఆయన అన్నారు. చిదంబరం ఆధ్వర్యంలో పని చేసే కమిటీ నిష్పాక్షికంగా పని చేస్తుందనే నమ్మకం లేదని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల వ్యవహారాన్ని చిదంరం నుంచి తప్పించాలని ఆయన ప్రధానిని కోరారు.

రాష్ట్ర పరిస్థితులపై కమిటీ వేయడాన్ని తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాద రావు వ్యతిరేకించారు. ప్రణబ్, రోశయ్య కమిటీలు ఉండగా మళ్లీ కమిటీ ఎందుకని ఆయన అడిగారు. చిదంబరంపై అనుమానాలున్నాయని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. కమిటీ కూడా చిదంబరం కను సన్నల్లోనే పని చేస్తుందని, అందువల్ల ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరుగుతుందని వారంటున్నిారు. దాడి వీరభద్రరావు, తదితర సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు కమిటీ ఏర్పాటుపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X