కమిటీపై టిడిపి సీమాంద్ర నేతల వ్యతిరేకత
తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు ఎంవి మైసురా రెడ్డి కేంద్ర హోం మంత్రి మైసురా రెడ్డిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. హైదరాబాదు పెద్ద నగరంగా ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ పలుకుబడిని దెబ్బ తీయడానికి చిదంబరం కుట్ర చేశారని ఆయన అన్నారు. చిదంబరం ఆధ్వర్యంలో పని చేసే కమిటీ నిష్పాక్షికంగా పని చేస్తుందనే నమ్మకం లేదని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల వ్యవహారాన్ని చిదంరం నుంచి తప్పించాలని ఆయన ప్రధానిని కోరారు.
రాష్ట్ర పరిస్థితులపై కమిటీ వేయడాన్ని తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాద రావు వ్యతిరేకించారు. ప్రణబ్, రోశయ్య కమిటీలు ఉండగా మళ్లీ కమిటీ ఎందుకని ఆయన అడిగారు. చిదంబరంపై అనుమానాలున్నాయని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. కమిటీ కూడా చిదంబరం కను సన్నల్లోనే పని చేస్తుందని, అందువల్ల ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరుగుతుందని వారంటున్నిారు. దాడి వీరభద్రరావు, తదితర సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు కమిటీ ఏర్పాటుపై తీవ్రంగా ధ్వజమెత్తారు.