వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కమిటీపై కోర్ కమిటీ భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితిపై వేసిన శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై బుధవారం సాయంత్రం జరిగే కాంగ్రెసు కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. కమిటీ విధివిధానాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది. అయితే, కాంగ్రెసు కోర్ కమిటీకి చూపించిన తర్వాత వాటిని ప్రకటించాలనేది కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం భావిస్తున్నారు. ఇప్పటికే తనపై సీమాంధ్ర నాయకుల నుంచి వ్యక్తిగత ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల తాను ఒక్కడినే కమిటీ విధివిధానాలపై నిర్ణయం తీసుకున్నట్లు అనిపించకుండా వాటిని కోర్ కమిటీ ముందు పెట్టి, ఆమోదం పొందిన తర్వాతనే ప్రకటించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కమిటీ విధివిధానాల వెల్లడిలో జాప్యం జరిగినట్లు చెబుతున్నారు.

అదే సమయంలో రేపటి కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను ఉంచనున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ప్రతి శుక్రవారం కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశమవుతుంది. ఏదైనా అత్యవసరమైన అంశం చర్చించాల్సి వస్తే మాత్రమే ఇతర రోజుల్లో సమావేశమవుతుంది. బుధవారం సమావేశం కావడానికి కమిటీ విధివిధానాల విషయంలో పెరుగుతున్న ఒత్తిడే కారణమని భావిస్తున్నారు. బుధవారం జరిగే కోర్ కమిటీ సమావేశంలో పెట్రోల్ ధరలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే నిత్యావసర ధరలపై చర్చించవచ్చు. కోర్ కమిటీ తర్వాత శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను చిదంబరం వెల్లడిస్తారా, ఇంకా జాప్యం చేస్తారా అనేది తెలియడం లేదు. కాగా, శ్రీకృష్ణ కమిటీ సమావేశం ఈ నెల 13వ తేదీన జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X