కె చంద్రశేఖర రావుతో చేతులు కలిపిన కాంగ్రెసు నేతలు

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా లేకపోతే ఎంతటి త్యాగాలకైనా వెనకాడవద్దని నిర్ణయించుకున్నారు. రాష్ట్రపతి పాలన వచ్చినా సరే వెనకాడవద్దని నిర్ణయించుకున్నారు. విధివిధానాలు నచ్చకుంటే శాసనసభకు గైర్హాజరు కావాలని కూడా అనుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఇప్పటి వరకు ప్రజలు ముందుకు నడిపించారని, ఇప్పడు మనం నడిపిద్దామని అనుకున్నారు. విధివిధానాల విషయంలోనే కాకుండా కాలపరిమితి విషయంలో కూడా పట్టుబట్టాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్రం నిర్దిష్టమైన, స్పష్టమైన ప్రకటన చేసే వారకు పోరాటం సాగించాలని నిర్ణయించుకున్నారు.
తెలంగాణ కోసం కఠిన నిర్ణయాలకు వెనకాడేది లేదని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాము ఏం చేస్తామనేది ఇప్పుడే చెప్పబోమని ఆయన అన్నారు. విధివిధానాలు, కాల పరిమితి తెలంగాణకు అనుకూలంగా లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకోవాలనే అంశంపై అన్ని కోణాల్లో చర్చించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications