హైదరాబాద్ : శ్రీకృష్ణ కమిటీని రద్దు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీమానా చేసేందుకు స్పీకర్ వద్దకు బయలుదేరి వెళ్లారు. ముందుగా నగరంలోని గన్పార్కు వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి వెళ్లారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అసెంబ్లీ గేట్లు తోసుకుని లోపలికి వెళ్ళేందుకు ఎమ్మెల్యేల యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.