నల్గొండ: నల్గొండ జిల్లా నకిరేకల్ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిదిమంది గాయపడ్డారు. ఆటో-లారీ ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. దాంతో ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
లారీ డ్రైవర్ ది తప్పా, ఆటో డ్రైవర్ ది తప్పా అన్న విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేకపోతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపటికి కానీ లభ్యమయ్యే అవకాశం లేదు.