వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్రిక్తత నడుమ అసెంబ్లీ రేపటికి వాయిదా

By Santaram
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్‌: అసెంబ్లీలో ఈరోజు ఉస్మానియా ఘటనపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రశ్నోత్తరాల అనంతరం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వం తరపున ప్రకటన చేశారు. అనంతరం అన్ని పార్టీలు లాఠీఛార్జి ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఇది ప్రభుత్వం చాతకానితనమని నిందించాయి. అనంతరం ప్రభుత్వం తరపున హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఈ పరిస్థితికి సభలోని అన్ని పార్టీలు కారణమని, ఇప్పటికైనా వారిని చదువుకోనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సభ రేపటికి వాయిదాపడింది.

మొదట హోంమంత్రి ప్రకటన చేయగా దానిపై అన్ని పార్టీలు స్పందించాయి. చివరగా ప్రభుత్వం తరపున హోంమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 68 రోజులుగా అశాంతి నెలకొనే ఉందని, ఇప్పటివరకు 1288 కేసులు నమోదయ్యాయని, 5 వేల మంది అరెస్టు అయ్యారని మంత్రి చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో మొత్తం 1070, సీమాంధ్రలో 218 కేసులు నమోదయ్యాయని ఆమె చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఆందోళనల్లో రూ.11 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందని సబిత చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X