వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉస్మానియాలో నక్సలైట్లు లేరు: విసి

By Santaram
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో మావోయిస్టులు లేరని వర్సీటీ వీసీ తిరుపతిరావు స్పష్టంచేశారు. అనుమతి లేకుండా పోలీసులు క్యాంపస్‌లో అడుగుపెట్టవద్దని తెలిపారు. క్యాంపస్‌లో శాంతికి కృషిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యేక తెలంగాణను కోరుకుంటూ యాదయ్య అలియాస్‌ యాదగిరి అనే విద్యార్థి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టడం... ఉస్మానియాను మరోసారి ఆందోళనా పథంలోకి నెట్టింది. ఓయూ విద్యార్థి ఐకాస తలపెట్టిన 'అసెంబ్లీ ముట్టడి' రోజునే జరిగిన ఈ ఘటన మరింత ఉద్విగ్న పరిస్థితులకు దారితీసింది.

విద్యార్థి ఆత్మహత్యాయత్నం విషయం తెలిసిన వెంటనే ఉస్మానియా పరిసరాల్లో నిరసనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఒక దశలో పోలీసులూ, విద్యార్ధులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లను, భాష్ప వాయువునూ ప్రయోగించాల్సి వచ్చింది. రెచ్చిపోయిన విద్యార్థులు తార్నాక బస్‌స్టాప్‌నకు నిప్పు పెట్టారు. రాత్రి 8 గంటల వరకూ కూడా ఓయూ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X