వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్య కళ్లు తెరవాలి: కిషన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న విద్యార్థుల బలిదానాలపై, తెలంగాణలో పరిస్థితిపై రోశయ్య కళ్లు తెరవాలని బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. శాసనసభ 30 నిమిషాల పాటు మంగళవారం వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే కనీసం చర్చించే స్థితిలో, ఆత్మ బలిదానాలు కూడదని విజ్ఝప్తి చేసే స్థితిలో సభ లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. రాష్ట్రాన్ని రెండు విభజించాలని, ప్రజలను విడదీయవద్దని ఆయన అన్నారు.

పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని రెండు విభజించాలని తాము అంటున్నామని, ఈ విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని ఆయన అన్నారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలను అపడానికి, తెలంగాణ ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పడానికి రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీని వేయడం ద్వారా తెలంగాణ అంశాన్ని ప్రభుత్వం కొల్డ్ స్టోరేజీలో పెట్టిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X