అడ్డుకుంటున్నవారితోనే పేచీ: కోదండరామ్

దృక్పథాలు ఎలా ఉన్నా సాధారణ ప్రజలతో తమకు ఏ విధమైన వైరం లేదని, అలాగే బతకడానికి వ్యాపారాలు చేసుకుంటున్నవారితో కూడా తమకు వైరం లేదని, వారికి ఏ విధమైన ఇబ్బందులుండవని ఆయన అన్నారు. అలాగే, తాము దాడులు చేస్తామని అనడం లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న పెట్టుబడిదారుల, సంపన్నుల ఉత్పత్తులను కొనవద్దని ప్రచారం చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. తాము శాంతియుత పద్ధతిలో ఉత్పత్తులను బహిష్కరిస్తామని అంటున్నామని, ఇది గాంధీ చూపిన శాంతియుత పోరాటమేనని ఆయన అన్నారు. అనైతికతను ఆమోదించవద్దని గాంధీ ఆనాడే చెప్పారని ఆయన అన్నారు. సమిష్టి నిర్ణయాలకు లోబడే జెఎసి తన కార్యక్రమాలు చేపడుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications