డిఎస్ ది విద్రోహ ప్రకటన: కోదండరామ్
శ్రీకృష్ణ కమిటీకి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఒకే అభిప్రాయాన్ని వెల్లడించాలని, అలా వెల్లడించేలా ప్రజలు ఆ పార్టీలపై ఒత్తిడి తేవాల్సి ఉంటుందని, అందుకు ప్రజలను తాము చైతన్యవంతులను చేస్తామని ఆయన చెప్పారు. ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమానికి సమాయత్తం చేయడానికి మార్చి 9వ తేదీ నుంచి తాము తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తామని, ఈ పర్యటనలు 18కల్లా పూర్తవుతాయని ఆయన చెప్పారు. 19, 20 తేదీల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ రావడానికి గల కారణాలను, అలా చేయడం వల్ల తెలంగాణకు జరిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తామని ఆయన అన్నారు.
తెలంగాణవాదులపై, తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై తాము రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా విజ్ఞప్తి చేశామని, అయినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. కేసుల విషయంలో ఇతర పద్ధతుల్లో కూడా తాము పోరాడి వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.