వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడప, చిత్తూరు జిల్లాల్లో భూప్రకంపనలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kadapa
హైదరాబాద్: కడప, చిత్తూరు జిల్లాల్లో శనివారంనాడు స్పల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై రోడ్ల మీదికి పరుగులు తీశారు. కడప జిల్లా రాయచోటి, చినమండ్యం, వీరబల్లి ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. కడప జిల్లా సరిహద్దు గ్రామాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

చిత్తూరు జిల్లాలోని ఐదు గ్రామాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కలకర, నలకడ, కోన, కలికిరి, దేవలపల్లి గ్రామాల్లో భూప్రకంపనలు సంభవించాయి. మూడు సెకన్ల పాటు భూ కంపించినట్లు సమాచారం. ఒక ఇంటి గోడలు బీటలు వారాయి. ప్రజలు ఇళ్లలోకి వెళ్లాలంటే భయపడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X