బొత్సకు జ్ఞానం ఉందా: దేవినేని ఉమ
రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామానికీ ఉలిక్కిపడే వీరప్ప మొయిలీ బొత్స వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయకపోవడం వల్ల కృష్ణా జిల్లాలో రెండు లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు తమ సమస్యలే తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణపై తెలుగుదేశం మరో శాసనసభ్యుడు దూళిపాళ నరేంద్ర చౌదరి కూడా విరుచుకుపడ్డారు.
కాగా, తన ప్రకటనపై మంత్రి మోపిదేవి వెంకటరమణ కాస్తా వెనక్కి తగ్గారు. తాను బొత్స సత్యనారాయణను సమర్థించినట్లు వార్తల్లో నిజం లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. బొత్స ప్రకటనను తాను సమర్థించడం గానీ వ్యతిరేకించడం గానీ చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. తన అభిప్రాయాన్ని శ్రీకృష్ణ కమిటీకి మాత్రమే చెప్తానని ఆయన అన్నారు. బొత్స తన అభిప్రాయాన్ని తాను వెల్లడించారని, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం గానీ సమర్థించాల్సిన అవసరం గానీ లేదని ఆయన అన్నారు.