హైదరాబాద్ తెలంగాణలో భాగమే: బొత్స

రాష్ట్ర విభజన జరిగితే మంచిదేనన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలని ఆయన అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు చాలా వెనకబడి ఉన్నాయని ఆయన అన్నారు. తమకు ఎర్రంనాయుడు, అశోక్ గజపతి రాజు వంటి నాయకులుండడం దురదృష్టకరమని ఆయన అన్నారు. శాసనసభలో తీర్మానం పెడితే బలపరుస్తామని నిరుడు డిసెంబర్ ఏడవ తేదీన చెప్పిన రాజకీయ నేతలు ఆ తర్వాత మాట మార్చారని ఆయన విమర్సించారు.












Click it and Unblock the Notifications