వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తస్లీమా వ్యాసంపై ఘర్షణలు: ఇద్దరు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Taslima Nasreen
బెంగళూరు: వివాదాస్పద బంగ్లా రచయిత్రి తస్లిమా నస్రీన్ వ్యాసంపై కర్నాటకలో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. ముస్లింలలో బుర్ఖా సంప్రదాయానికి సంబంధించి స్థానిక పత్రికలో సోమవారం ప్రచురితమైన వివాదాస్పద బంగ్లాదేశీ రచయిత్రి తస్లిమా నస్రీన్ వ్యాసం కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ వ్యాసంలో మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా తస్లిమా వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వచ్చాయి.ఆమె వ్యాసాన్ని యథాతథంగా అనువదించి కన్నడ పత్రిక ఒకటి ప్రచురించగా, దీనికి వ్యతిరేకంగా ముస్లింలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కర్నాటకలోని మూడు జిల్లాల్లో మత ఘర్షణలు చెలరేగి ఇద్దరు మరణించారు. ముఖ్యంత్రి యడ్యూరప్ప సొంత జిల్లా అయిన షిమోగాతో సహా హసన్, బెల్గాం జిల్లాల్లో విధ్వంసకాండ, హింస చెలరేగాయి. యాభై దాకా వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు షిమోగాలో పలుమార్లు లాఠీచార్జి అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. భాష్ప వాయువు ప్రయోగించారు. ఫలితం లేకపోవడంతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. షిమోగాలోని నాలుగు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకూ కర్ఫ్యూ విధించారు.

హసన్, బెల్గాం జిల్లాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఘర్షణలకు కారణమైన వ్యాసాన్ని ప్రచురించిన పత్రికపై రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఏ మతానికి చెందిన వారి మనోభావాలను గాయపరిచేలా కథనాలు ప్రచురించినా, ప్రభుత్వం సహించదని సీఎం యడ్యూరప్ప హెచ్చరించారు. వివిధ వదంతులను నమ్మి ఉద్వేగానికి గురి కావద్దని ఆయన ముస్లింలకు పిలుపునిచ్చారు. షిమోగాలో సోమవారం మధ్యాహ్నం 1500 మంది ముస్లింలు తస్లిమా నస్రీన్ వ్యాసానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహిస్తుండగా, హింస చెలరేగింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో షిమోగాలో కర్ఫ్యూ విధించారు.

హసన్‌లోనూ అల్లరిమూకలు విధ్వంసకాండకు పాల్పడి వాహనాలకు, దుకాణాలకు నిప్పు పెట్టాయి. దీంతో పట్టణంతో పాటు, ముందు జాగ్రత్తగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ ఘర్షణలకు నిరసనగా శ్రీరామసేన మంగళవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా ఆదివారం రాత్రి నుంచే మత ఘర్షణలతో అట్టుడుకుతున్న వాయవ్య జిల్లా బెల్గాంలోనూ కర్ఫ్యూ విధించారు. బెంగళూరు నగరం అంతటా ఐదు రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంకర్ బిదరి ప్రకటించారు. హఠాత్తుగా చెలరేగిన ఈ మత ఘర్షణల వెనుక పెద్ద కుట్ర ఉందని షిమోగా ఎంపీ రాఘవేంద్ర ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X