వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రో ధరలపై పార్లమెంటులో మంటలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: పెట్రో ధరలపై పెంపుపై పార్లమెంటు ఉభయ సభలు బుధవారం అట్టుడికాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో సభా కార్యక్రమాలు స్తంభించడంతో పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోకసభ సమావేశం కాగానే సమాజ్ వాదీ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం బిజెపి సభ్యులు కూడా అదే మార్గం పట్టారు. సభ్యుల తీరు గమనించిన స్పీకర్ మీరా కుమార్ సభను గంటపాటు వాయిదా వేశారు.

రాజ్యసభలో కూడా ప్రతిపక్షాలు పెట్రో ధరల పెంపును నిరసించాయి. రాజ్యసభలో బిజెపి, ఎస్పీ, అన్నాడియంకె, బిఎస్పీ, వామపక్షాల సభ్యులు పెట్రో ధరల పెంపుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ తమ స్థానాల్లో నిలబడి ఆందోళనకు దిగారు. చైర్మన్ హమీద్ అన్సారీ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ ప్రతిపక్షాల సభ్యులు వినలేదు. దీంతో ఆయన సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X