వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హనుమాన్ జంక్షన్ లో పట్టపగలు చోరీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Krishna Dist
ఏలూరు: కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో పట్టపగలే ఇద్దరు దుండగులు ఒక ఇంట్లో చొరబడి చోరీ చేశారు. ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరినీ వారు తుపాకీతో బెదిరించారు. డబ్బు, బంగారం ఎక్కడ ఉందో చెప్పమని వత్తిడి తెచ్చారు. ఇంట్లో డబ్బులేదు. 40 కాసుల బంగారం, వెండి వస్తువులను దోచుకువెళ్లారు.

ఇంట్లో ఉన్న ఎటిఎం కార్డులు తీసుకొని, వాటి పాస్‌వర్డ్‌ కూడా తెలుసుకొని వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగింది. దుండగులు పారిపోయిన తరువాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి దుండగులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X