తెలంగాణ వాదులచే ఎంపీ రాజయ్య ఘెరావ్

కార్యకర్తలకు నచ్చజెప్పడానికి రాజయ్య ప్రయత్నించినా వారు వినకపోవడంతో చేసేదేం లేక వెనుదిరిగారు. అనంతరం ఎంపీ విలేకరులతో మా ట్లాడుతూ కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించొద్దని, రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణవాదం పేరుతో అనవసరమైన వివాదాలు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవద్దని ఆయన సూచించారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్సేనని చెప్పారు. కార్యక్రమంలో రావుల సదానందం, బీజేపీ, టీఆర్ ఎస్ నేతలు రామలింగం, చాంద్, రమేష్, గబ్బెట శ్రీని వాస్, ఎస్.కృష్ణ, అశోక్, కుమార్, శివ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications