తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరు మేయర్ ఇళ్లలో ఎసిబి సోదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nellore
నెల్లూరు: నెల్లూరు మేయర్ భానుశ్రీ ఇంటిపై, ఆమె బంధువుల ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారు జామున ఐదు గంటల నుంచే ఎసిబి అధికారులు నెల్లూరు, హైదరాబాదు, తిరుపతిల్లో సోదాలు సాగిస్తున్నారు. నెల్లూరులో ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో 90 లక్షల రూపాయల మేర ఆస్తులు బయటపడ్డాయి. భానుశ్రీ భర్త సుబ్బరాజుపై వచ్చిన ఆరోపణలతో ఎసిబి అధికారులు ఈ సోదాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. భానుశ్రీ భర్త సుబ్బరాజు ఎలక్ట్రికల్ డిపార్ట్ మెంటులో డిఇగా పనిచేస్తున్నారు.

హైదరాబాదులో భానుశ్రీకి మూడు ప్లాట్లు, నెల్లూరులో 15 ప్లాట్లు ఉన్నట్లు ఎసిబి సోదాల్లో బయటపడినట్లు తెలుస్తోంది. రెండు కార్లు కూడా ఉన్నాయి. ఇతర ఆస్తులను కూడా ఎసిబి అధికారులు కనిపెట్టారు. ఈ ఆస్తులన్నీ భానుశ్రీ పేరు మీద కాకుండా భర్త, ఇతర బంధువుల పేర్ల మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల భానుశ్రీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. తనకు ఆస్తులేమీ లేవని భానుశ్రీ సాయిబాబ గుడిలో ఇటీవల ప్రమాణం చేశారు. భానుశ్రీ పేరు మీద ఉన్న ఆస్తులను ఇంకా కనిపెట్టాల్సి ఉందని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X