హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహీంద్ర సత్యం వద్ద విద్యార్ధుల నిరసన

By Santaram
|
Google Oneindia TeluguNews

Mahindra Satyam
హైదరాబాద్: హైటెక్‌ సిటీలోని మహీంద్ర సత్యం కంపెనీ ఎదుట ఇంజనీరింగ్‌ విద్యార్థులు సోమవారం నిరసన వ్యక్తంచేశారు. సత్యం కంపెనీ మూడేళ్ల క్రితం తమను ఎంపిక చేసుకొని ఉద్యోగాలు ఇవ్వలేదని వారు ఆరోపించారు. 2007-08 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా సత్యం సంస్థ క్యాంపస్‌ లలో ఇంటర్య్వూలు నిర్వహించి 17,561 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుంది. వీరిలో హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌, మధ్యప్రదేశ్‌, బెంగళూరు ప్రాం తాలకు చెందిన 35 మంది నిరసన వ్యక్తం చేశారు.

ఎంసీఏ, బీటెక్‌, ఎంటెక్‌ పూర్తి చేసిన తమకు ఏడాదికి రూ 3 లక్షల ప్యాకేజీ ఆఫర్‌ తో ఎంపిక చేశారని, మూడేళ్లు గడిచినా ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన కంపెనీ ప్రతినిధులు నలుగురి విద్యార్థులను పిలిపించి మాట్లాడారు. తాము నిర్వహించే టెస్ట్‌ల్లో ఎంపికైన వారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పినట్లు బాధిత విద్యార్థులు వివరించారు. కంపెనీ వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని వారు కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X