ఆ హత్య చేసింది పోలీసు కానిస్టేబులే

ఈ నేపథ్యంలో వెంకట రమణ ఆ సొమ్ము ఇస్తానని నమ్మబలికి తోడల్లుడిని ఈ నెల పదో తేదీ ఉదయం సామర్లకోట రప్పించాడు. అప్పటి నుంచీ శ్రీరామచంద్రరావు ఆచూకీ తెలియరాలేదు. శ్రీరామచంద్రరావు ఆదశ్యమైనట్టు వెంకట రమణ ఈ నెల 12న సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే తన భర్తను మరిది వెంకట రమణ జగ్గంపేట నుంచి సామర్లకోట రప్పించి మాయం చేశాడని, హత్య చేసి ఉండవచ్చని, ఈ నెల 13న శ్రీరామచంద్రరావు భార్య గీత సామర్లకోట పోలీసులకు మరో ఫిర్యాదు చేసింది.
దీంతో సీఐ కె.విజయ్ శేఖర్ కానిస్టేబుల్ను ఆదివారం అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. తోడల్లుడిని తానే హత్య చేసినట్టు రమణ సోమవారం రాత్రి అంగీకరించాడు. మృతదేహాన్ని స్థానిక సుధ ఫ్యాక్టరీ వెనుక పొలాల్లో పూడ్చినట్టు తెలిపాడు. అతడికి సహకరించినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, నిందితుడు తానొక్కడినే ఈ నేరం చేసినట్టు చెప్తున్నాడు. ఎస్పీ వై.నాగిరెడ్డి, మండల మేజిస్ట్రేట్ల సమక్షంలో మృతదేహాన్ని బుధవారం ఉదయం వెలికి తీయనున్నారు. మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications