వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడ ప్రజలకు మళ్ళీ సైరన్ భాగ్యం

By Santaram
|
Google Oneindia TeluguNews

Kakinada
కాకినాడ: బ్రిటిషు కాలం నాటి 'సైరన్‌'కూత మళ్లీ నగర వాసులకు వినిపించనుంది. వాటర్‌ వర్క్స్‌ ఆవరణలోగల ఈ సైరన్‌ ఒకప్పుడు కాకినాడకు ల్యాండ్‌ మార్క్‌గా పేరు. ప్రతీ రోజు ఉదయం ఆరు, మధ్యాహ్నం 12, మళ్లీ సాయంత్రం ఆరుగంటలకు ఈ సైరన్‌కూత వినిపించేది. నిముషంపాటు మోగే ఈ సైరన్‌ ప్రజలకు కచ్చితమైన సమయాన్ని సూచించేది. అయితే దాదాపు 15 ఏళ్లుగా ఈ సైరన్‌ మూలనపడింది.

జిల్లా ప్రణాళిక మండలి సభ్యుడు, సీనియర్‌ కార్పొరేటర్‌ దండు మహంతి లకణరావు కాకినాడ వాసులకు మళ్లీ సైరన్‌ కూత యథావిధిగా వినిపించాలంటూ కార్పొరేషన్‌ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దాంతో దాదాపు రూ.లక్ష వెచ్చించి వాటర్‌వర్క్స్‌లో కొత్త సైరన్‌ను కొద్దిరోజుల క్రితమే ఏర్పాటు చేశారు. ఈ సైరన్‌కూత దాదాపు ఎనిమిది కిలోమీటర్ల పరిధి వరకు వినిపిస్తుంది. పాత జ్ఞాపకాలకు గుర్తుగా పునరుద్ధరిస్తున్న ఈ సైరన్‌ నిర్వహణ బాధ్యతను కార్పొరేషన్‌ చేపడుతోంది. త్వరలో ఈ సైరన్‌ను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X