హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో సమైక్యాంధ్ర కార్యాలయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Yerran Naidu
హైదరాబాద్: తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు హైదరాబాదులో సమైక్యాంధ్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జూబిలీహిల్స్ లోని సాగర్ సొసైటీలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చే నివేదిక రూపకల్పనకు ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కమిటీ సభ్యులుగా కె ఎర్రంనాయుడు, కోడెల శివప్రసాద రావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవహరిస్తారు.

శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చే నివేదికను రూపొందించి ముసాయిదాను ప్రజల్లో ముందు చర్చకు పెట్టాలని తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు అనుకుంటున్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత తుది నివేదికను రూపొందిస్తారు. ఈ నివేదికను శ్రీకృష్ణ కమిటీకి సమర్పిస్తారు. రాష్ట్రం కలిసే ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X