ప్రశాంత వాతావరణానికి సహకరిద్దాం: జగన్

అందరూ సమానులేనన్న భావన ఇలాంటి ఘటనల వల్ల విశ్వాసం కొల్పోయేలా చేస్తాయని, అన్నదమ్ముల్లా అందరూ కలిసుండే విధంగా ప్రజలంతా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి సమయాల్లో పుకార్లను నమ్మవద్దని, శాంతి పునరుద్ధరణకు ఒకరికి ఒకరు తోడుగా నిలిచి హైదరాబాద్ నగరంలో చారిత్రాత్మకంగా ఇమిడిపోయిన సర్వమత సంస్కతికి మళ్లీ జీవం పోయాలని ఆయన చెప్పారు. ఆవేశకావేశాలతో ముడిపడి ఉన్న ఈ అల్లర్లు ఆగిపోయేలా చేయడంలో ప్రతి ఒక్కరూ పూర్తి బాధ్యత తీసుకోవాలని, శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని చేతులు జోడించి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నానని అని లేఖలో జగన్ అన్నారు.












Click it and Unblock the Notifications