పగో జిల్లాలో జగన్ సుడిగాలి పర్యటన
జిల్లాలో మూడురోజులపాటు ఆయన పర్యటిస్తారు. 13 నియోజకవర్గాలలో మొత్తం 500 కిలో మీటర్ల మేర జగన్ పర్యటన సాగుతుంది. వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక అసువులు బాసిన 37 ప్రాంతాల్లోని 42 మంది వైఎస్ అభిమానుల కుటుంబాలను ఆయన స్వయంగా కలిసి పరామర్శిస్తారు. 9న ఏలూరు, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో పర్యటించి ఆ రోజు రాత్రి భీమవరంలో బస చేస్తారు. 10న నరసాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.
ఆ రోజు రాత్రి తాడేపల్లిగూడెంలో బస చేస్తారు. 11న గోపాలపురం, కొవ్వూరు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో పర్యటించి ఖమ్మం జిల్లా పర్యటనకు వెళతారు. ఎంపీ జగన్ పర్యటనపై ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని గృహంలో కాంగ్రెస్ నాయకులు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ నెల 9 నుంచి 11వరకు జగన్ పర్యటించే ప్రాంతాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై తుది విడతగా సమీక్ష జరిపారు.