వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విస్తరణపై కాంగ్రెసు ఎమ్మెల్యేల ఉత్కంఠ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె. రోశయ్య చేపట్టే మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెసు శాసనసభ్యుల్లో ఉత్కంఠ నెలకొనగా, మంత్రుల్లో ఆందోళన కనిపిస్తోంది. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన రోశయ్య తన మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం ఆమోద ముద్ర వేయించుకుంటారనే ప్రచారం జరుగుతోంది. రోశయ్య జాబితాలో ఎవరున్నారో తెలియడం లేదు. ఈ విషయంలో రోశయ్య చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా ఢిల్లీలో ఉన్నారు. దీంతో కాంగ్రెసు శాసనసభ్యులు మంత్రి వర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. కొంత మంది శాసనసభ్యులు ఢిల్లీలో మకాం వేసి లాబీయింగ్ చేస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణ అంశం ముందుకు వచ్చినప్పటి నుంచే మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి పట్ల తమ విధేయతను ప్రదర్శించేందుకు నానా ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు మద్దతు ప్రకటించిన చాలా మంది తమ విధేయతను మార్చుకున్నారు. జగన్ విధేయులైన జూనియర్ మంత్రులకు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు కూడా చెలరేగుతున్నాయి. దీంతో మంత్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X