హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్ భరో: వామపక్ష నేతల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
హైదరాబాద్: ధరల పెరుగుదలకు నిరసనగా వామపక్షాల నేతలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం చేపట్టారు. హైదరాబాదులో ఎజి కార్యాలయం వద్ద వామపక్ష నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. దాంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు వినలేదు. దీంతో పోలీసులు సిపిఐ నాయకులు నారాయణ, సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఎం నాయకుడు బివి రాఘవులును పోలీసులు అరెస్టు చేశారు.

ధరలు తగ్గించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వామపక్షాల నేతలు చెప్పారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తామని వారన్నారు. ధరల పెరుగుదలకు నిరసనగా జాతీయ స్థాయిలో ఉమ్మడి ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X