శ్రీనగర్: కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో వేర్పాటువా గెరిల్లాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఓ జనాను మరణించినట్లు, మరో జవాను గాయపడినట్లు పోలీసులు గురువారం చెప్పారు. రాజ్వార్ అటవీ ప్రాంతంలోని జచల్దారా ప్రాంతంలో మిలిటెంట్ల స్థావరాన్ని సంయుక్త బలగాలు చుట్టుముట్టాయి. ఈ సమయంలో మిలిటెంట్లకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఎదురు కాల్పుల్లో ఒక జవాను మరణించగా, మరొకతను గాయపడ్డాడు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టినట్లు, సంఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు.