వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ కాల్పుల్లో జవాను మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jammu & Kashmir
శ్రీనగర్: కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో వేర్పాటువా గెరిల్లాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఓ జనాను మరణించినట్లు, మరో జవాను గాయపడినట్లు పోలీసులు గురువారం చెప్పారు. రాజ్వార్ అటవీ ప్రాంతంలోని జచల్దారా ప్రాంతంలో మిలిటెంట్ల స్థావరాన్ని సంయుక్త బలగాలు చుట్టుముట్టాయి. ఈ సమయంలో మిలిటెంట్లకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఎదురు కాల్పుల్లో ఒక జవాను మరణించగా, మరొకతను గాయపడ్డాడు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టినట్లు, సంఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X