శ్రీకృష్ణ కమిటీ గడువు పెంచొద్దు: లగడపాటి

కులం, మతం, ప్రాంతీయత పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం సులువని, కొందరు ఓట్లు దండుకోడానికి దీన్ని సులువైన మార్గంగా ఎంచుకున్నారని ఆగ్రహించారు. తెలంగాణ ప్రజలు చాలా మంచివారని, అమాయకులని ఆయన కితాబిచ్చారు. పదవులకు రాజీనామా చేసి మళ్లీ వారే పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, వేరే వారికి ఇస్తే ఉపయోగకరమన్నారు. రెండో ఎస్సార్సీ ద్వారానే రాష్ట్రాల పునర్విభన సాధ్యమని సీడబ్ల్యుసీ తీర్మానించిందని, దానికి అంగీకరించాకే తెరాసతో 2004లో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నట్టు ఆయన చెప్పారు. కేసీఆర్ ఒత్తిడి మేరకే విస్తృత సంప్రదింపుల కోసం ప్రణబ్కమిటీని కేంద్రం నియమించిందన్నారు. కడప ఎంపీ వైఎస్ జగన్ తలపెట్టిన ఓదార్పుయాత్ర ఆయన వ్యక్తిగతమని, తన నియోజకవర్గానికి వచ్చినప్పుడు తప్పకుండా మద్దతిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications