వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి వర్గ విస్తరణపై చర్చించలేదు: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో మంత్రి వర్గ విస్తరణపై చర్చించలేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. ఢిల్లీ వచ్చిన ఆయన గురువారం వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ మధ్య మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగలేదని ఆయన చెప్పారు.

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి పార్టీ తరఫున నివేదిక సమర్పించే విషయంపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి), పార్టీ అధిష్టానం చూసుకుంటాయని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికల సమర్పణకు ఇచ్చిన గడువును పొడగించాలని కోరుతారా, లేదా అనేది కూడా అవే చూసుకుంటాయని ఆయన అన్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణపై చర్చించలేదని రోశయ్య చెబుతున్నప్పటికీ మొయిలీతో ప్రధానంగా ఆ విషయంపైనే చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X