వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళల మంత్రి పదవుల భద్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
న్యూఢిల్లీ: ప్రస్తుతం తన మంత్రివర్గంలో ఉన్న ఐదుగురు మహిళా మంత్రులను ముఖ్యమంత్రి కె. రోశయ్య కొనసాగించవచ్చునని అంటున్నారు. రోశయ్య కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి మంత్రివర్గ విస్తరణకు ఆమోద ముద్ర వేయించుకుంటారని అంటున్నారు. ఆయన తన మంత్రివర్గంలో భారీ మార్పులే చేయవచ్చుననే మాట వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ప్రస్తుత విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణకు చెందిన సీనియర్ శాసనసభ్యుడికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. నల్లగొండ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కె. జానారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ప్రస్తుతం 9 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని రోశయ్య భర్తీ చేసే అవకాశాలున్నాయి. ప్రసుత మంత్రివర్గంలోని మంత్రులను ఎవరినైనా తొలగిస్తారా, లేదా అనేది కూడా ఉత్కంఠభరితమైన అంశంగానే మారింది. పలువురు సీనియర్ శాసనసభ్యులను దివంగత ముఖ్యమంత్రి పక్కన పెట్టారు. వారంతా ఇప్పుడు మంత్రి పదవులు వస్తాయని ఆశ పడుతున్నారు. జెసి దివాకర్ రెడ్డి, కె. జానారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్ి, మర్రి శశిధర్ రెడ్డి, పి శంకరరావు వంటి సీనియర్లు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. అలాగే, ప్రస్తుత స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిపదవి ఆశిస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి, స్పీకర్ గా ఉత్తమ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X