అల్మట్టి: కాంగ్రెసుపై ధ్వజమెత్తిన చంద్రబాబు

కృష్ణా నది మిగులు జలాలపై ఆధారపడి తమ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు చేపట్టామని, రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానం వల్ల కృష్ణా జలాలు రాష్ట్రానికి అందే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపట్టడానికి ముందుకు రావాలని ఆయన ముఖ్యమంత్రి కె. రోశయ్యను డిమాండ్ చేశారు. ఆల్మట్టి ఎత్తును అపించడానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. తాము శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసినా ఫలితం లేకుండా పోయిందని, పలు ఆందోళనలు చేపట్టామని, అయినా ప్రభుత్వం సరిగా స్పందించలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications