మావోయిస్టులపై పోలీసులకు గవర్నర్ హిత బోధ
తూర్పుగోదావరి జిల్లా లోని ఏజెన్సీ ప్రాంతంలో వారి ప్రాబల్యం గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కిందిస్థాయి అధికారులు, ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం. ఎటువంటి లోటుపాట్లకు అవకాశం ఇచ్చినా దంతేవాడ లాంటి ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకునే అవకాశముందని హెచ్చరించారు.
ఎప్పుడూ మావోయిస్టులది పైచేయి కాకుండా చూసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఏలూరు రేంజి డీఐజీ మహేష్ భగవత్, విజయవాడ పోలీసు కమిషనర్ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, రైల్వే ఎస్పీ కే వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ రామకృష్ణయ్య, తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ (రంపచోడవరం) విక్రంజిత్ దుగ్గల్లు సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Story first published: Sunday, April 11, 2010, 10:22 [IST]