మమతకు కనీవినీ ఎరుగని షాక్ ? ఏకంగా 20 మంది ఎంపీలు..!
పశ్చిమబెంగాల్లో అధికారం కోల్పోయాక తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కి అన్నీ షాకులే. ఇప్పటికే గెలిచిన 80 మంది ఎమ్మెల్యేల్లో 59 మంది వేరు కుంపటి పెట్టుకోవడమే కాకుండా విపక్ష నేత పదవిని సైతం లాక్కుని వెళ్లిపోయారు. ఇప్పుడు ఎంపీల వంతు. ఈసారి తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నట్లు తాజాగా వార్దలొస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే పార్లమెంట్ లోనూ మమత పార్టీ శకం ముగిసినట్లే కనిపిస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్ను కుదిపేసిన సంక్షోభం..ఇప్పుడ పార్లమెంటుకు విస్తరించింది. కనీసం 20 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీ ఫిరాయింపునకు ప్రణాళికలు రచిస్తున్నారని జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీ వెల్లడించింది. అత్యున్నత స్థాయిలో ఈ చర్చలు జరుగుతున్నాయని, పార్టీ మారడానికి ఎంపీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంటు ఉభయ సభలలో కలిపి తృణమూల్ కాంగ్రెస్కు మొత్తం 41 మంది ఎంపీలు ఉండగా.. ఇందులో లోక్సభలో 28 మంది, రాజ్యసభలో 13 మంది ఉన్నారు. ఇప్పుడు వీరిలో 20 మంది పార్టీ మారిపోతే మమత పార్టీ ప్రాభవానికి గట్టి దెబ్బ తప్పకపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తన పార్టీ శ్రేణుల్లోని తిరుగుబాటుతో సతమతం అవుతున్న మమతా బెనర్జీకి ఇది మరో పెద్ద దెబ్బ అవుతుంది. పార్లమెంటరీ గ్రూపులో చీలిక ఏర్పడితే, అది మమతా బెనర్జీకి అతిపెద్ద దెబ్బగా మారనుంది. ప్రతిపక్ష శిబిరంలో ఎంపీల పరంగా టీఎంసీ ప్రస్తుతం రెండవ అతిపెద్ద కూటమి. అక్కడ తిరుగుబాటు జరిగితే పార్లమెంటులో టీఎంసీ, ప్రతిపక్షాల పట్టుకు తీవ్రంగా గండి పడుతుంది.














Click it and Unblock the Notifications