TMC Split: తృణమూల్ లో చీలిక- 50 ఎమ్మెల్యేల వేరుకుంపటి.! శివసేన తరహాలో..!
పశ్చిమ బెంగాల్లో నిన్న మొన్నటివరకూ అధికారం చెలాయించి, దేశంలోనే దుర్భేద్యమైన ప్రాంతీయ పార్టీగా కనిపించిన తృణమూల్ కాంగ్రెస్ .. తాజాగా అధికారం చేజారిపోగానే ఒక్కసారిగా కుదేలవుతోంది. ముఖ్యంగా బెంగాల్లో ఏర్పడిన బీజేపీ సర్కార్ దాడులతో భయపెడుతున్న తీరు తృణమూల్ కాంగ్రెస్ నేతల్ని కుదురుగా ఉండనీయడం లేదు. దీంతో టీఎంసీని వీడి బీజేపీలో చేరుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతల సంఖ్య పెరుగుతోంది. దీంతో వారిని వరుసగా మమత సస్పెండ్ చేస్తున్నారు. ఇది అంతిమంగా టీఎంసీలో చీలికకు (TMC Split) దారి తీస్తోంది.
చీలిక దిశగా టీఎంసీ ( TMC Split)
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చీలిక ముప్పు కనిపిస్తోంది. పార్టీ నుండి సస్పెండ్ అయిన నాయకుడు రిజు దత్తా ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. పార్టీ భవిష్యత్తుపై 50 మంది ఎమ్మెల్యేలు ఒక హోటల్లో రహస్య చర్చలు జరిపారని ఆయన వెల్లడించారు. వీరు పశ్చిమ బెంగాల్ స్పీకర్ను కలిసి మూడు కీలక డిమాండ్లను ముందుకు తెస్తారని తెలిపారు. ఆ డిమాండ్లలో ముఖ్యంగా, తామే "అసలైన తృణమూల్" అని ప్రకటించుకోవడం, పార్టీ గుర్తుపై తమకు హక్కు ఉందని వాదించడం, ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బందోపాధ్యాయ ఉండాలనడం ప్రధానమైనవి.

50 ఎమ్మెల్యేల వేరు కుంపటి
సుమారు 50 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని, తాము రెండొంతుల మెజారిటీ కలిగి ఉన్నామని ఆయన తెలిపారు. శోభందేబ్ ఛటర్జీ స్థానంలో విపక్ష నేతగా రితబ్రత ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలు రితబ్రత బందోపాధ్యాయ, సందీపన్ సాహా తమ సంతకాలు ఫోర్జరీ అయ్యాయని ఆరోపిస్తూ స్పీకర్కు లేఖ రాయడంతో మొదలయ్యాయి. దీనిపై టీఎంసీ వారిని బహిష్కరించింది. రిజు దత్తా వెల్లడించిన ప్రకారం, కునాల్ ఘోష్ సైతం చెప్పినట్లుగా, రితబ్రత నేతృత్వంలో సుమారు 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఒక హోటల్లో, ఆపై ఎమ్మెల్యే హాస్టల్లో సమావేశమయ్యారు.

శివసేన తరహాలోనే
రిజు దత్తా దీనిని పశ్చిమ బెంగాల్లో శివసేన మహారాష్ట్ర మోడల్ అమలుగా అభివర్ణించారు. 2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చివేసి, శివసేనను చీల్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ తిరుగుబాటు కేవలం శాసనసభ్యుల విభజనకు మాత్రమే పరిమితం కాలేదు. ఉద్ధవ్ ఠాక్రే చివరకు "శివసేన" పేరును, దాని గుర్తును షిండే వర్గానికి కోల్పోయారు. సీనియర్ నేత శోభందేబ్ ఛటర్జీ మాత్రం, మెజారిటీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ వెనకాలే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ "ద్రోహులు" అని తీవ్రంగా విమర్శించారు. వారు పశ్చిమ బెంగాల్లో ఒక "సువేందు ప్రభుత్వంలో చేరాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications