వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో పరిశ్రమలకు కేంద్రం బ్రేక్

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నం నగరాన్ని పట్టిపీడిస్తున్న కాలుష్యంపై కేంద్రం చర్యలు తీసుకుంది. కొద్దికాలంగా విశాఖ పోర్టుతో పాటు ఇతర పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంపై ప్రజలు, పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు, నిపుణులు చేస్తున్న ఉద్యమాల సెగ కేంద్రాన్ని తాకింది.

అత్యంత సుందర నగరమైన విశాఖలో కొత్త పరిశ్రమల ఏర్పాటుపై ఆరు నెలల పాటు మారిటోరియం విధించింది. ఈ మేరకు అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ జారీచేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగుచూశాయి.

దేశంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆయా ప్రాంతాల్లో సమగ్ర పర్యావరణ కాలుష్య సూచీ(సీపీసీఐ)ని ప్రాతిపదికగా తీసుకుంటుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ సీపీసీఐ ఆధారంగా దేశంలోని 83 నగరాల్లో కాలుష్య తీవ్రతను గణించింది. మన రాష్ట్రంలో పటాన్‌చెరు, బొల్లారం, విజయవాడ తదితర నగరాలలోనూ ఈ గణన నిర్వహించింది. విశాఖ నగరం వీటన్నింటినీ తోసిరాజని కాలుష్యంలో మొదటి స్థానంలో నిలిచింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X