కాంగ్రెసు, టిడిపిలనూ పిలుస్తాం: శ్రీకృష్ణ

రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం సహజమని ఆయన అన్నారు. తొలుత తమ కమిటీని వ్యతిరేకించినవారు కూడా ఇప్పుడు సహకరిస్తున్నారని ఆయన చెప్పారు. తమ సంప్రదింపుల ప్రక్రియ సజావుగా సాగుతోందని ఆయన అన్నారు. మే 6,7 తేదీల్లో మళ్లీ రాష్ట్ర పర్యటన ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ అంశంపైనే కాకుండా రాష్ట్ర పరిస్థితిపై సమగ్రంగా అధ్యయన చేస్తున్నామని ఆయన చెప్పారు. గడువులోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. అన్ని సమస్యలను అధిగమించి పరిష్కారం కనుక్కుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications