చిరుకు నిరసనగా మాలమహానాడు కర్రలు, కారం

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30సంవత్సరాల సినీ జీవితంలో తెలంగాణ ప్రాంతంలో ఆస్తులను సంపాదించుకుని, ఈ ప్రాంత ప్రజల భిక్షతో పేరు గడించి..నేడు తల్లిపాలు తాగి రొమ్మును తన్నిన చందంగా చిరంజీవి ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు.
ఈ ప్రాంతంలోనే ఆయన సినిమాలకు విశేష ఆదర ణ ఉందని, తెలంగాణ రాష్ట్రం వద్దు సమైక్యాంధ్రనే కావాలని అన్న చిరంజీవి తెలంగాణలో అడుగుపెటనివ్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయిని చంద్రమోహన్, దార కుమార్, ఇర్రి శ్రీనివాస్, దండెం వెంకన్న, లవకుమార్, చింతమల్ల కళావతి, పిల్లి సుశీల, కొచ్చెర్ల సంతోష, సుజాత, సోమమ్మ, దార పద్మ, దార ఉప్పలమ్మ, వడ్డె సావిత్ర, దార కళమ్మ, ఇర్రి రమాదేవి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications