హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిదంబరం ప్రకటనపై స్పందించను: శ్రీకృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

BN Srikrishna
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనపై తాను స్పందించబోనని రాష్ట్ర పరిస్థితి అధ్యయనానికి ఏర్పడిన కమిటీ చైర్మన్ జస్టిస్ శ్రీకృష్ణ అన్నారు. తెలంగాణ అంశం రాష్ట్రంలోనే పరిష్కారం కావాలని చిదంబరం అంటున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సాధ్యం కాదని, అది పార్లమెంటుకే సాధ్యమని ఆయన అన్నారు. తాము ఏ నివేదిక ఇచ్చినా తుది నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుకే ఉంటుందని ఆయన అన్నారు.

తెలంగాణ, సమైక్యాంధ్ర అని కాకుండా తాము ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ నెల పదవ తేదీన తెలుగుదేశం పార్టీ నాయకులతో, 11వ తేదీన మజ్లీస్ నాయకులు, లక్ష్మీ పార్వతితో సమావేశమవుతామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర జెఎసితో కూడా సమావేశమవుతామని ఆయన చెప్పారు. తమకు లక్షా పది వేలకు పైగా నివేదికలు అందాయని, వాటిని భవిష్యత్తు రెఫరెన్స్ కోసం దాచి పెడతామని ఆయన చెప్పారు.

కాగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తప్ప తెలంగాణకు మరో పరిష్కారం లేదని తెలంగాణ మేధావుల ఫోరం, తెలంగాణ ఉద్యమకారుల సమాఖ్య ప్రతినిధులు శుక్రవారం శ్రీకృష్ణ కమిటీ సభ్యులతో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ సమస్య పెరుగుతుందనే వాదనలో నిజం లేదని వారన్నారు. తెలంగాణ కోసం ఎన్నో నిబంధనలను చేసినా వాటిని ఆంధ్రా పాలకులు తుంగలో తొక్కారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X