వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒక ప్రాంతం వాడ్ని కాను: చిరు
పోలవరం ప్రాజెక్టు కోసం తాను చేస్తున్నది ఒంటరి పోరాటం కాదని, ప్రజా పోరాటమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నామని, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ను కలిసి పోలవరం ప్రాజెక్టుపై విజ్ఞపి చేస్తామని ఆయన చెప్పారు. పోలవరం కోసం జరుగుతున్న పోరాటంలో ఇతర పార్టీలు వస్తే కలుపుకుని పోతామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులున్నాయని, ప్రాధాన్యతా క్రమంలో తాము పోలవరం సాధన కోసం తొలుత పోరాటం చేస్తున్నామని, ఆ తర్వాత మిగతా ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Monday, May 10, 2010, 11:32 [IST]