వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక ప్రాంతం వాడ్ని కాను: చిరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విశాఖపట్న: తాను ఒక ప్రాంతానికి చెందినవాడిని కానని, అన్ని ప్రాంతాలకు చెందినవాడినని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. పోలవరం ప్రాజెక్టు సాధన కోసం చేపట్టిన యాత్రలో ఆయన విశాఖపట్నంలో సోమవారం తన పర్యటనను సాగిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు ఏదో ఒక ప్రాంతం మీద మాత్రమే అభిమానం ఉన్నవాడిని కానని, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి చెందినవాడినని, ఇతర ప్రాంతాల ప్రాజెక్టులపై కూడా తన పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు కోసం తాను చేస్తున్నది ఒంటరి పోరాటం కాదని, ప్రజా పోరాటమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తున్నామని, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ను కలిసి పోలవరం ప్రాజెక్టుపై విజ్ఞపి చేస్తామని ఆయన చెప్పారు. పోలవరం కోసం జరుగుతున్న పోరాటంలో ఇతర పార్టీలు వస్తే కలుపుకుని పోతామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులున్నాయని, ప్రాధాన్యతా క్రమంలో తాము పోలవరం సాధన కోసం తొలుత పోరాటం చేస్తున్నామని, ఆ తర్వాత మిగతా ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X