వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జుడాల ఆందోళన: ఇద్దరు రోగుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Warangal
హైదరాబాద్: వరంగల్ లోని ఎంజిఎం ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు మంగళవారం తమ ఆందోళనను ఉధృతం చేశారు. దీంతో వైద్యం అందక ఇద్దరు రోగులు మరణించారు. పెంచిన స్టయిఫండ్లను చెల్లించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సోమవారం ఆందోళన ప్రారంభించారు. స్టయిఫండ్ల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లభించకపోవడంతో జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలను కూడా బహిష్కరించారు.

నిరుడు నవంబర్ లో చేసిన ఆందోళన కారణంగా స్టయిఫండ్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అయితే పెంచిన స్టయిఫండ్ ను చెల్లించడం లేదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. తమకు రోగులకు సేవ చేసే ఉద్దేశం ఉంది కాబట్టే తాము ఇంత కాలం వేచి చూశామని వారంటున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు చెప్పారు. నగరంలోని ఇతర ఆస్పత్రుల జూనియర్ డాక్టర్లు కూడా ఆందోళనకు దిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X